దక్షిణాఫ్రికాతో టెస్టుల తర్వాత భారత్ వన్డే సిరీస్లో భాగంగా రాంచీలో ప్రాక్టీస్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ గురువారం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంటికి వెళ్లి, ఆయనను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాంచీలో ఆదివారం జరిగే తొలి వన్డేకు ధోనీ హాజరవుతారా? లేదా? అన్నది అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది. IPL తర్వాత మైదానంలో కనిపించని ధోనీని మరోసారి చూడాలన్న ఆశ ఫ్యాన్స్లో పెరుగుతోంది.