మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. ఆసీస్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జెమియా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ హర్మన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివరిలో రిచా ఘోష్, దీప్తి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.