ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా
విమానం సాంకేతిక సమస్య కారణంగా ఎనిమిది గంటలు గాల్లోనే ప్రయాణించి, చైనా గగనతలం మీదుగా తిరిగి ఢిల్లీకి చేరుకుంది. బుధవారం బయలుదేరిన ఈ బోయింగ్ 777-300 ER విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానం గాల్లో ఉండగా తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయిందని, సమస్యను పరిష్కరించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది.