తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో.. యాసంగి సీజన్లో పండించిన మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా జొన్నలు పండించిన వేలాది మంది రైతులకు మద్దతు ధర లభించనుంది.