తెలంగాణకు తాను వెళ్లకూడదా అని
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ
జనసేన నేతలు పోరుపెడితే అక్కడికి వెళ్తానని, పుష్కర కాలం తర్వాత కూడా అంత ద్వేషం ఊహించలేదని ఆయన వాపోయారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదని, తెలంగాణ 100 శాతం భూమి పుత్రుల జాగీరేనని స్పష్టం చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే కదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.