
డీకే శివకుమార్ మంత్రివర్గం ఖరారు
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జి.పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కేహెచ్ మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి ఇలా 13 మంది నేడు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.




