పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఆగ్రహం: క్షమాపణ చెప్పాలని డిమాండ్

23274చూసినవారు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఆగ్రహం: క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు పర్యటన సందర్భంగా కోనసీమ రైతులతో మాట్లాడుతూ, "కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తాకింది" అన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణపై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని వారు సూచించారు. ఇక్కడ వ్యాపారం చేసుకుని అవమానించడం తగదని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you