కేసీఆర్ సింహగర్జనతో ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం

1476చూసినవారు
కేసీఆర్ సింహగర్జనతో ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం
కరెంట్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అణచివేసిన నేపథ్యంలో, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్ 27న కరీంనగర్‌లో సింహగర్జన సభలో స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఆనాటి పాలకులు వెక్కిరించినా, కేసీఆర్ రాజకీయ చతురతతో నాలుగు కోట్ల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి, 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, తెలంగాణను యూపీఏ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. వ్యూహాత్మక ఎత్తుగడలతో 2009 డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసినా, సమైక్య పాలకుల కుట్రలతో వెనక్కి తగ్గింది. మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ అన్ని పార్టీలను ఏకం చేసి, తెలంగాణను ఉద్యమ క్షేత్రంగా మార్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.

సంబంధిత పోస్ట్