తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం బకాయిపడ్డ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు బంద్ మూడోరోజు కొనసాగుతుంది. సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించిన ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం వేసిన కమిటీలతో కాలయాపన చేయకుండా 50 శాతం బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.