తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల

69చూసినవారు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు విద్యార్థులు పాఠశాల హెడ్‌మాస్టర్లకు ఫీజు చెల్లించాలి. హెచ్‌ఎంలు నవంబర్ 14 లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, నవంబర్ 18 లోపు విద్యార్థుల డేటాను డీఈవోలకు అందించాలి. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు, రూ.200తో డిసెంబర్‌ 2–11 వరకు, రూ.500తో డిసెంబర్‌ 15–29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.