ఏపీ, తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదు అవుతన్నాయి. బుధవారం అత్యధికంగా తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తురాబాద్లో 46 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఏపీలో నెల్లూరు జిల్లా కొమ్మలపాడులో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. గురువారం కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లొద్దని సూచించింది. అత్యవసరం అయితే తలకు టోపీ, కాటన్ వస్త్రాలు ఉపయోగించాలని పేర్కొంది.