రోడ్డు పక్కన బైక్ పై నిలబడి ఉన్న ఒక వ్యక్తిని టెంపో ట్రక్కు ఢీకొట్టిన ఘటన వైరల్ గా మారింది. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు పక్కన నిలబడేందుకు తగినంత స్థలం ఉన్నప్పటికీ, తారుతో సిద్ధం చేసిన రోడ్డుపైన బైక్ తో ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. తోటి వాహనాదారులను గమనించి వాహనాలు నడపాలని నెటిజన్లు అంటున్నారు.
రోడ్డు ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదాలను నివారించవచ్చు