అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందినట్లు తెలిసింది. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భూమి చౌహాన్ అనే యువతి విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దాంతో ఆ విమానం అప్పటికే టేకాఫ్ అయింది. విమానం ప్రమాదానికి గురవ్వడంతో షాక్కు గురయ్యానని భూమి చౌహాన్ చెప్పారు.