AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మరోసారి ఉగ్రమూలాలు కలకలం రేపాయి. ధర్మవరం పోలీసులు మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్కు చెందిన సజ్జద్ హుస్సేన్ను అరెస్ట్ చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఆగస్టు 16న ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.