అమెరికాలోని టెక్సాస్ కుండపోత వర్షాలకు అతలాకుతలమైంది. ఇప్పటికి వరకు 51 మృతి చెందగా.. పలువురు గల్లంతు అయ్యారు. గ్వాడలుపె సమీపంలోని సమ్మర్ క్యాంప్కి 750 మంది బాలికలు వచ్చారు. వరదలు రావడంతో 23 మంది బాలికలు గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని నెలలపాటు కురవాల్సిన వాన గురువారం రాత్రి కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు.