TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దారుణం జరిగింది. నిజాంపేట్లో తల్లి తన ఇద్దరు పిల్లలను చంపేసింది. అనంతరం తానూ కూడా ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ప్రమీల తన ఇద్దరు కుమారులు ధనుష్(3), సూర్య వంశీ(నెలన్నర)ని గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.