మహీంద్రా థార్ ఆధారంగా, దేశీయ సైనిక అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహీంద్రా ఏటీవీ (ఆల్ టెరియన్ వెహికల్)ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన ప్రద్ 4×4 సంస్థతో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. మెటల్ బాడీతో రూపొందించిన ఈ వాహనం ఎయిర్డ్రాప్ను సైతం తట్టుకోగలదు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్తో 172 హెచ్పీ శక్తిని, 400 Nm టార్క్ను ఉత్పత్తి చేసే ఈ ఏటీవీలో ఆయుధాల కోసం గన్ మౌంట్, అండర్ బాడీ ప్రొటెక్షన్, విండ్షీల్డ్ ప్రొటెక్టర్, అదనపు టైర్లు, ఇంధనం/నీటి సదుపాయం ఉన్నాయి.