TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో మీర్జాగూడ వద్ద ప్రమాదానికి గురైన బస్సు ఆర్టీసీ హైర్ వెహికల్ (అద్దె)గా గుర్తించారు. ఈ మేరకు బస్సు డ్రైవర్ పేరు దస్తగిరి బాబా అని పోలీసులు వెల్లడించారు. బస్సు నంబర్ TG 34TA 6354. ఈ తెల్లవారుజామున 5 గం.కు బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయల్దేరింది. 6.15AMకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్ రాధ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమె ఎడమవైపు కూర్చోవడం వల్లే ప్రాణాలు దక్కినట్లు తెలుస్తోంది.