TG: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, సఫాయీల శ్రమను రేవంత్రెడ్డి గుర్తించటం లేదని ఆరోపించారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు
కాంగ్రెస్ బాధితులయ్యారని, మంత్రుల జీతాల్లో కోత వేసి ఇస్తామనడానికి వాళ్లు వరద బాధితులా అని
కేటీఆర్ మండిపడ్డారు.