TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. '8+8 గుండు సున్నా అనేది కాంగ్రెస్, బీజేపీకి తెలుసు. వీళ్ల అసమర్థతను డైవర్ట్ చేయడానికే కేసీఆర్ను విచారణకు పిలిచారు. డైవర్షన్, సబ్ డైవర్షన్, పర్వర్షన్, ఇదీ కాంగ్రెస్ పాలన. ఫోకస్ మళ్లించడానికే KCRను ఆదివారం విచారించారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు. అయినా కేసీఆర్ సిట్కు పూర్తిగా సహకరించారు. కాంగ్రెస్ పెద్దల పైశాచిక ఆనందానికి నేటితో తెరపడుతుందని భావిస్తున్నా' అని కేటీఆర్ అన్నారు.