
ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై 19 రాష్ట్రాల దావా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియాతో పాటు 19 రాష్ట్రాలు శుక్రవారం బోస్టన్ కోర్టులో కేసు వేశాయి. ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించి, ఆదాయం కోసం ఏకపక్షంగా ఛార్జీలు పెంచడం రాజ్యాంగానికి విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు. ఈ పెంపు కంపెనీలపై ఆర్థిక భారం మోపి, ఉద్యోగులకు నిత్యావసర సేవలు, విద్య, ఆరోగ్యం వంటివి అందించడం కష్టతరం చేస్తుందని ఆయన తెలిపారు.




