తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ను హుస్నాబాద్లో నిర్మిస్తున్నారు. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ఎల్లమ్మ చెరువు వద్ద ఈ ఆధునిక వంతెన రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ను చూడటానికి ఇప్పటికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొమటి చెరువులా ఇదీ మంచి ఆకర్షణగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. సందర్శకులకు కొత్త అనుభూతిని అందించే ఈ ప్రాజెక్ట్, ప్రాంతీయ టూరిజానికి మరింత ఊతమివ్వనుంది.