
భారత్ విధానం ఎవరూ నిర్దేశించక్కర్లేదు: జైశంకర్
భారత్ విదేశాంగ విధానాన్ని ఏ దేశం నిర్దేశించాల్సిన అవసరం లేదని, ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు పెంచుకునే స్వేచ్ఛ, హక్కు భారత్కు ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్-రష్యా సంబంధాలపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ తన పంథాను వీడదని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకోసం ఏ దేశంతోనైనా జట్టుకట్టడానికి సిద్ధమని మంత్రి జైశంకర్ అన్నారు.




