వన్ నేషన్ - వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం (2025 - 2027) మూడు సంవత్సరాలకు రూ. 6,000 కోట్ల బడ్జెట్ను కేంద్రం కేటాయించింది. ఈ పథకం ద్వారా 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అంతరాయం లేని డిజిటల్ విద్యా వనరుల యాక్సెస్ అందనుంది. తద్వారా ప్రముఖ యూనివర్సిటీల జర్నల్స్, పరిశోధనా పత్రాలు అందుబాటులోకి రానున్నాయి.