రామజన్మభూమి ఉద్యమానికి కీలక నిర్మాత, ఉద్యమ ప్రధాన సూత్రధారి అయోధ్య మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి (75) సోమవారం ఉదయం మధ్యప్రదేశ్లో కన్నుమూశారు. డిసెంబర్ 10న ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని రేవాకు వచ్చిన ఆయన, రామకథ నిర్వహించారు. బుధవారం ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, హిందువులను జాగృతి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.