హర్యానాలోని సోనిపత్లో దారుణం జరిగింది. సందీప్ అనే వ్యక్తి తన రెండో భార్య ప్రియాంకను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే లోతైన గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని తరలించేందుకు స్నేహితుడు నిజాముద్దీన్కు ఫోన్ చేయగా, శవం ఉందని భావించిన నిజాముద్దీన్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సందీప్ను అదుపులోకి తీసుకున్నారు.