విశాఖపట్నంలో న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబె అలరించాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా సరే, 23 బంతుల్లో 65 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. మ్యాచ్ అనంతరం దూబె మాట్లాడుతూ.. "నా ఆట మెరుగవడానికి కారణం హార్డ్ వర్క్. కఠిన పరిస్థితుల్లో ఆడటం వల్ల బౌలర్ల వ్యూహాలు అర్థమవుతున్నాయి" అని తెలిపాడు.