ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాత వధువు తనను తాకితే చంపేస్తానని వరుడిని కత్తితో బెదిరించింది. తాను వేరొకరి ఆస్తిని అని, తనను ఏమీ చేయవద్దని ఆమె చెప్పింది. వరుడు భయపడి, మంచం కింద పరుపు వేసుకుని నిద్రపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించాడు. వారు విచారణ చేపట్టగా ఆమె పెళ్లికి ముందు మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు.