TG: మూసీ నది ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల కడుపులో మూసీ కాలుష్యం కంటే ఎక్కువ విషమే ఉందని సీఎం మండిపడ్డారు. తమపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మనుషుల కడుపులో ఉన్న విషం మూసీ కాలుష్యం కంటే ప్రమాదకరమని విమర్శించారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తోంటే విషం ఎందుకు కక్కుతున్నారని ప్రశ్నించారు.