దేశంలో ఇంధన కొరత లేదని, కానీ ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని కేంద్రం పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. సరుకు రవాణా కోసం రైళ్లను, అవకాశం ఉన్న చోట ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాల కృషి చేయాలని సూచించింది.