
స్కూల్ యూనిఫాంలో వచ్చి లిక్కర్ కొన్న అమ్మాయిలు (వీడియో)
మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికలు ప్రభుత్వ మద్యం దుకాణం నుండి మద్యం కొనుగోలు చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశుతోష్ ఠాకూర్, తహసీల్దార్, పోలీసులు మద్యం దుకాణాన్ని సందర్శించి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మిన యజమానిని విచారిస్తున్నారు. బాలికలు స్వయంగా వచ్చారా లేక ఎవరైనా పంపించారా అనే దానిపై కూడా విచారణ జరుగుతోంది.




