TG: బీఆర్ఎస్ హయాంలో
కేసీఆర్ అప్పులు చేసి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారని మాజీ మంత్రి
కేటీఆర్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు లేదని, రాహుల్ బంధు నడుస్తోందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ లేకపోగా, ధాన్యం కొనే నాథుడే లేదని విమర్శించారు.