వజ్రాల లాకెట్ మింగిన దొంగ.. సహజ పద్ధతిలో స్వాధీనం చేసుకున్న పోలీసులు

న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఓ దొంగ రూ.లక్షలు విలువ చేసే వజ్రాలు పొదిగిన గుడ్డు ఆకారంలోని లాకెట్ను మింగేశాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం సహజ పద్ధతిలో లాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాలతో పాటు ఐప్యాడ్ను కూడా దొంగిలించినట్లు గుర్తించారు. నిందితుడిని డిసెంబర్ 8న కోర్టులో హాజరుపరచనున్నారు.
