డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని, లండన్లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కూడా వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, విద్య ద్వారా దళితులు ఎదగాలని ఆయన విశ్వసించారు. "చదువు, పోరాడు, సాధించు" అనే నినాదంతో ఆయన దళితుల అభ్యున్నతికి కృషి చేశారు. భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ నిర్మాతగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన కీలక పాత్ర పోషించారు. కుల వివక్ష నిర్మూలనకు, పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం పాటుపడ్డారు. న్యాయవాదిగా కూడా వారికి అండగా నిలిచారు.