కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. తీవ్రవాదులు ఆయనను త్వరలోనే హత్య చేస్తారంటూ పోస్ట్ ద్వారా అందిన ఆ లేఖలో తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పాశ్వాన్ కార్యాలయం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై భద్రతా దళాలు విచారణ చేపట్టి, ఆయన భద్రతను సమీక్షిస్తున్నాయి.