TS: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మూడు బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సులలోని ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.