డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

167చూసినవారు
డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్