ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాలి: సీఎం రేవంత్​

62చూసినవారు
ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాలి: సీఎం రేవంత్​
TG: దేశం గర్వించదగిన గొప్ప నేత సీనియర్ ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలంటే ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాలని రేవంత్​ అన్నారు. అంబేడ్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ భారతదేశ జాతిరత్నాలంటూ కొనియాడారు. నీతి, నిజాయతీ, ఉక్కుసంకల్పం కలిగిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ తనకు జీవితకాలం గుర్తుంటుందన్నారు.