తెలంగాణలో గురువారం జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. 3,800కు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 3వేల పంచాయతీల్లో పోలింగ్ను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, స్పెషల్ పోలీస్ సిబ్బందితో పాటు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.