రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నెల 15న ఢిల్లీతో జరిగే మ్యాచ్ కోసం హెచ్సీఏ 15 మందితో జట్టును ప్రకటించింది. రాహుల్ సింగ్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. జట్టులో సీవీ మిలింద్, తన్మయ్, అభిరత్ రెడ్డి, హిమతేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ ఉన్నారు.