తిరుపతి-శిరిడీ రైలును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపై ఈ రైలు సర్వీసును రోజూ నడపాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అంగీకారం తెలిపింది. ఇప్పటి వరకు తాత్కాలికంగా నడుస్తున్న తిరుపతి-శిరిడీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ఈ రైలు శిరిడీ వెళ్లనుంది.