AP: తిరుపతి ఎస్వీ జూపార్క్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టైం స్కేల్ ఉద్యోగి ఏబీఓ హరిబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. జూపార్క్ రేంజర్ వేధింపులే కారణమని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. రూ.11 లక్షల బంగారు నగలు తాకట్టు పెట్టి పనులు చేశానని, రూ.25 లక్షల బిల్లులు రావాల్సి ఉన్నప్పటికీ జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జూ డైరెక్టర్ సెల్వం విచారణకు ఆదేశించారు.