మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. భారతదేశంలో గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాయంత్రం 6.20 నుంచి 6.47 గంటల మధ్య గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈ గ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలు మూసివేయబడతాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్తో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా కనిపిస్తుంది.