TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ అయితే ఈ ఎన్నిక గెలుపోటములపై బెట్టింగ్స్ జోరుగా సాగుతునట్లు తెలుస్తోంది. రేపు రిజల్ట్ కావడంతో.. రూ. 400 నుంచి రూ. 500 కోట్ల వరకు బెట్టింగ్స్ జరిగినట్లు సమాచారం. గెలుపొందే అభ్యర్థి ఎవరనే దానితో పాటు, మెజార్టీపై కూడా పెద్ద మొత్తంలో పందెం కాశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ తో పాటు బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయని వినికిడి.