మహారాష్ట్రలోని పాల్ఘర్ లోని భగేరియా కెమికల్స్ ఫ్యాక్టరీలో ఓలియం అనే ప్రమాదకరమైన విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనతో ఫ్యాక్టరీలోని 458 మంది కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు కళ్లు మండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.