టయోటా ఫార్చ్యూనర్ ఎస్యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ షాక్ ఇస్తూ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ.34.76 లక్షల నుండి రూ.50.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్న ఈ కారు ధర గరిష్టంగా రూ.87,000 వరకు పెరిగింది. ముఖ్యంగా, టాప్-స్పెక్ GR-S 4X4 AT వేరియంట్ ధర అత్యధికంగా పెరిగింది. ఎంట్రీ-లెవల్ పెట్రోల్ 4X2 AT మోడల్ ధర రూ.60,000, డీజిల్ వేరియంట్లలో 4X2 MT ధర రూ.60,000, 4X2 AT ధర రూ.65,000, 4X4 MT ధర సుమారు రూ.67,000 పెరిగాయి.