శంషాబాద్ విమానాశ్రయానికి సుడాన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ చరిత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహమ్మద్ అనే ఈ ప్రయాణికుడికి గతంలో ఎబోలా సోకినట్లు తేలడంతో, అతడిని అధికారులు వెనక్కి పంపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విమానాశ్రయంలో కలకలం రేగింది.