భారత్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరమయ్యాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్పై దృష్టిపెట్టడానికి హెడ్ని టీ20 జట్టు నుంచి విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని అతడిని ఆదేశించారు. హెడ్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్ని చివరి రెండు టీ20లకు తీసుకున్నారు. నవంబర్ 6న నాలుగో టీ20, 8న ఐదో టీ20 జరగనుంది.