ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాలో మరొక విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కుంభమేళాలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. విషయం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.