అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్స్పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్రంప్ స్నేహితుడిగా ప్రసిద్ధి చెందిన కిర్క్ ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు. ఘటనపై ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.